భారత్‌లో తగ్గుతున్న కేసులు.. స్వల్పంగా పెరిగిన మరణాలు

by vinod kumar |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని ఒకటి, రెండు మినహా సుమారు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, మరణాల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరిగింది.

తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,63,533 కరోనా కేసులు నమోదు కాగా, 4,329 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం ఇండియాలో 2,52,28,996 కేసులు వెలుగుచూడగా, మొత్తంగా 2,78,719 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 33,57,765 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.44 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు కేంద్రం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed