- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Stock Markets: రాణించిన బ్యాంక్, స్టీల్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దిశ, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) శుక్రవారం లాభాల్లో ముగిశాయి. దీంతో మూడు రోజుల నుంచి కొనసాగుతున్న వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం కూడా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆసియా మార్కెట్(Asia Market)లో సానుకూల సంకేతాలు రావడం, ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లతో క్రమక్రమంగా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.సెన్సెక్స్(Sensex) ఉదయం 80,749.26 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలయ్యింది. ఇంట్రాడేలో 80,409.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 218 పాయింట్ల లాభంతో 81,224.75 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 104 పాయింట్ల లాభంతో 24,854 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నష్టపోయిన షేర్లు : ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్