బిగ్‌బాస్ బగ్‌లో కంటెస్టెంట్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దామిని! (వీడియో)

by Hamsa |
బిగ్‌బాస్ బగ్‌లో కంటెస్టెంట్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దామిని! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ దామిని బిగ్‌బాస్-7 సీజన్ షోలో పాల్గొంది. కానీ అనుకోకుండా మూడు వారాలకే ఎలిమినేట్ అయింది. తాజాగా, ఆమె బిగ్‌బాస్ బగ్ షోలో పాల్గొని కంటెస్టెంట్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ బగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న గీతూ రాయల్ ఒక మనిషికి ఊపిరాడకుండా చేయొచ్చనుకున్నారా? అని దామినిని ప్రశ్నించింది.

దానికి ఆమె అది కేవలం టాస్క్ మాత్రమేనని తెలిపింది. తర్వాత తెలుగులో మాట్లాడితే బూతులు ఇంగ్లీష్‌లో మాట్లాడితే నీతులా అని గీతూ అనడంతో ఏమనాలో అర్థం కాక దామిని సైలెంట్ అయిపోయింది. వెంటనే కంటెస్టెంట్స్‌పై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. దానికి దామిని రతిక అన్నీ సగం సగం వింటుంది, శుభశ్రీ రెడీ అవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా పని కూడా చేయాలి. యావర్ ఇతరులను కాస్త అర్థం చేసుకోవాలి. తేజ వెటకారం తగ్గించుకోవాలంది. శోభాశెట్టి చెంచా తేజ. గౌతమ్ తనకే అన్నీ తెలుసనుకుంటాడు. శివాజీది కన్నింగ్ గేమ్. ప్రశాంత్ గురించి మాట్లాడటమే వేస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎపిసోడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed