ఆటో బైక్ ఢీ.. ఒకరు మృతి

by Sumithra |
ఆటో బైక్ ఢీ.. ఒకరు మృతి
X

దిశ, చేవెళ్ల : బైక్ ఆటో ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. షాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన బచన్‌గారి శేఖర్ రెడ్డి (50) షాబాద్ మండలం నాగర్‌గూడ వచ్చి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా తాళ్ళపల్లి గ్రామ పరిధిలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది.

ఈ సంఘటనలో దేవరంపల్లి గ్రామానికి చెందిన రైతు శేఖర్‌రెడ్డి కి తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు షాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుమారుడు సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed