ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

by srinivas |
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: గనుల సినరేజీ వసూళ్లపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వసూళ్ల బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సినరేజీ వసూళ్ల కోసం బిడ్లు పిలవాలని గనులశాఖ నిర్ణయించింది. 13 జిల్లాలను 6 ప్యాకేజీలుగా విభజించి బిడ్లు ఆహ్వానించేందుకు ప్రణాళికను రచించింది. 6 ప్యాకేజీలకు మొత్తంగా రూ.2,900 కోట్లుగా రిజర్వ్ ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ల దక్కించుకున్న సంస్థలు గనుల తవ్వకం, వేయింగ్‌, ఈ-పర్మిట్, డెలివరీ వ్యవహారాల పర్యవేక్షణ చేయనున్నాయి.

ప్యాకేజీల వివరాలు ఇవే!

1.ఒకటో ప్యాకేజీ- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు
2.రెండో ప్యాకేజీ- తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు
3.మూడో ప్యాకేజీ – కృష్ణా, గుంటూరు జిల్లాలు
4. నాలుగో ప్యాకేజీ -ప్రకాశం జిల్లా
5. ఐదో ప్యాకేజీ -నెల్లూరు, చిత్తూరు జిల్లాలు
6. ఆరో ప్యాకేజీ -అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు

Next Story