Bandi Sanjay:ఏపీకి ఎంపీ బండి సంజయ్.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-10-26 14:51:37.0  )
Bandi Sanjay:ఏపీకి ఎంపీ బండి సంజయ్.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay) ఈ నెల 28న విశాఖపట్నం(Visakhapatnam) వెళ్లనున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీలో బయలుదేరి రాత్రి 7.55 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు(Visakha Airport)కు చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌ నోవాటెల్‌(Hotel Novatel)కు వచ్చి రాత్రికి బస చేస్తారు. 29వ తేదీ మంగళవారం ఉదయం వీఎంఆర్గీఏ చిల్ట్రన్‌ ఎరినాకు చేరుకుని రోజ్‌గార్‌ మేళాకు హాజరవుతారు. అనంతరం నోవాటెల్‌కు వెళ్లి, అక్కడ నుంచి మధ్యాహ్నం 3.35 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌(Hyderabad) బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story