- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
శ్రీవారి లడ్డూ వ్యవహారంపై రచ్చ రచ్చ.. సీఎంకు జేపీ నడ్డా ఫోన్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో నాణ్యత లేదని ప్రచారం జరుగుతోంది. జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని వాడినట్లు తేలడంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి జేపీ నడ్డా ఫోన్ చేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తాము పరిశీలించి తగిన చర్యలకు ఆదేశిస్తామని తెలిపారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని, రాష్ట్ర అధికారులతో మాట్లాడి నివేదికలను పరిశీలిస్తానని చంద్రబాబుకు జేపీ నడ్డా పేర్కొన్నారు.
Advertisement
Next Story