శ్రీవారి లడ్డూ వ్యవహారంపై రచ్చ రచ్చ.. సీఎంకు జేపీ నడ్డా ఫోన్

by srinivas |
శ్రీవారి లడ్డూ వ్యవహారంపై రచ్చ రచ్చ.. సీఎంకు జేపీ నడ్డా ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో నాణ్యత లేదని ప్రచారం జరుగుతోంది. జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని వాడినట్లు తేలడంతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి జేపీ నడ్డా ఫోన్ చేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తాము పరిశీలించి తగిన చర్యలకు ఆదేశిస్తామని తెలిపారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని, రాష్ట్ర అధికారులతో మాట్లాడి నివేదికలను పరిశీలిస్తానని చంద్రబాబుకు జేపీ నడ్డా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed