గొంతునొప్పి తక్షణ ఉపశమనం కోసం మెడికల్ షాపుకు పరుగులు తీస్తున్నారా? ఈ ఆయుర్వేద పద్ధతుల్ని అనుసరించండి!

by Anjali |
గొంతునొప్పి తక్షణ ఉపశమనం కోసం మెడికల్ షాపుకు పరుగులు తీస్తున్నారా? ఈ ఆయుర్వేద పద్ధతుల్ని అనుసరించండి!
X

దిశ, వెబ్‌డెస్క్: గొంతు నొప్పి అత్యంత సాధారణ వ్యాధుల్లో ఒకటి. ఇది వైరస్ వల్ల వస్తుంది. చాలా మందిలో ఈ పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు,పెద్దలు గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వందలో 99 శాతం మంది మెడికల్ షాపుల బాట పడుతారు. అయితే ప్రతిసారి టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు.

జలుబు, కఫం, గొంతునొప్పి, జీర్ణక్రియ వంటి సమస్యలను తరిమికొట్టడానికి మీ వంటింట్లో ఉండే మూడు వస్తువులను ట్రై చేస్తే చాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు. త్రికటు చూర్ణం గొంతునొప్పి తగ్గించడంలో సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. నల్ల మిరియాలు, శొంఠి (అల్లం), పిప్పాలి కలిపి ఈ చూర్ణాన్ని తయారు చేసుకోండి. ఇది తీసుకుంటే గొంతు నొప్పి పోవడమే కాకుండా ఆకలిని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. దగ్గు, జలుబు, అలర్జిక్ రైనైటిస్ ఆస్తమా వంటి ప్రాబ్లమ్స్ మాయమవుతాయి.

త్రికటు చూర్ణంలో డిటాక్సిఫికేషన్ లక్షణాలను కలిగి ఉంటుంది. పిప్పాలి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. దీన్ని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా థైరాయిడ్ సమస్యకు చెక్ పెడుతుంది. గొంతునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాగా ఈ పొడిని నైట్ తిన్నాక 3 గ్రాములు వాటర్‌లో కలిపి తీసుకోవాలి. కారంగా ఉంటుంది కాబట్టి.. ఆహారంలో కూడా కలిపి తీసుకోవచ్చు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed