టౌన్ ప్లానింగ్ అధికారిపై మహిళ దాడి..?

by Aamani |
టౌన్ ప్లానింగ్ అధికారిపై మహిళ దాడి..?
X

దిశ,పేట్ బషీరాబాద్: టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై మహిళ దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. గాజులరామారం సర్కిల్ కార్యాలయం చెందిన టౌన్ ప్లానింగ్ విభాగం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం లో ఉన్న మొదటి అంతస్తులో కొనసాగుతుంది. శుక్రవారం ఓ మహిళ గాజులరామారం టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న ఓ అధికారితో వాగ్వివాదం పెట్టుకున్నది. అనంతరం మాట మాట పెరిగి చేయి చేసుకునే అంతవరకు వెళ్లిందని తెలుస్తుంది. గొడవ పెద్దది అవుతుండడంతో అక్కడి సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లి చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గొడవపడిన మహిళ ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది అన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ గొడవ పై టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉన్న ఫ్లోర్ లో ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. అందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అని మాత్రమే చెప్పుకొస్తున్నారు. సర్కిల్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు నమోదయ్యాయని కొందరు అనుకుంటే కార్యాలయంలో అసలు సీసీ కెమెరాలు పనిచేయడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఇదే తరహాలో మరో ఘటన జరిగితే ఆ సందర్భంగా కూడా సీసీ కెమెరాలు పని చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శుక్రవారం నాడు గాజుల రామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన గొడవ హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed