వీధి శునకాల స్వైర విహారం.. బెంబేలెత్తుతున్న జనం

by Jakkula Mamatha |
వీధి శునకాల స్వైర విహారం.. బెంబేలెత్తుతున్న జనం
X

దిశ, పోలవరం:పోలవరం పంచాయతీ బీసీ కాలనీలో శుక్రవారం ఉదయం గణేష్ నగర్‌కి చెందిన ఓ చిన్నారిని బీసీ కాలనీకి చెందిన ట్రైలర్‌ని ఊరకుక్కలు కురవడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టడంతో ప్రాణాపాయం తప్పింది. కుక్కల దాడిలో గాయపడ్డ బాధితులు కార్మెల్ పురం నుంచి మరి కొంతమంది పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా మెయిన్ సెంటర్‌లో చికెన్ షాపులు వద్ద ఈ ఊరకుక్కలు గుంపులుగా సంచరిస్తూ పాఠశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థులపై , వాహనదారులపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు రోడ్డుపై సంచరించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story