సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ సంఘాల ప్రతినిధులు

by Mahesh |
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ సంఘాల ప్రతినిధులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గల్ప్ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, గల్ఫ్ కార్మికుల కష్టనష్టాలను అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడం, గల్ఫ్ వర్కర్ల కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేయడం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వడం వంటి అంశాలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story

Most Viewed