ఏపీలో మరో సంచలనం.. మాజీ మంత్రి విడుదల రజనీపై విచారణకు ఆదేశం

by srinivas |
ఏపీలో మరో సంచలనం.. మాజీ మంత్రి విడుదల రజనీపై విచారణకు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి విడుల రజినీపై హోంమంత్రి అనితకు పల్నాడు జిల్లాకు చెందిన స్టోన్ క్రషర్స్ యజమానులు ఫిర్యాదు చేశారు. విడుదల రజినీ మంత్రిగా ఉన్న సమయంలో తమ వద్ద డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువాపైనా ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో సమగ్ర విచారణ జరపాలని అధికారులను హోంమంత్రి అనిత ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత పరిశీలన చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా విడుదల రజినీపై మరిన్ని ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. రైతుల నుంచి కూడా రజినీ డబ్బులు తీసుకున్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులతో రజినీ చిక్కుల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి.

Next Story

Most Viewed