Tirupati: పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి

by srinivas |
Tirupati: పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో విషాదం చోటు చేసుకుంది. పిచ్చాటూరు మండలం హనుమంతపురంలో పిడుగుపడి(Thundered) ఇద్దరు మృతి చెందారు. రైతులు రాము, మణి పొలంలో పని చేస్తుండగా ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా భారీ వర్షం(Heavy Rain) పడింది. ఆకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో పొలంలో ఉన్న ఇద్దరు రైతులు(Farmers) అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాము, మణి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఇరు కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉన్న రాము, మణి మృతి చెందటంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed