చిత్తూరులో మిస్టరీగా మారిన కార్మికుడి మృతి.. యజమానే చంపేశారా..?

by Disha Web Desk 16 |
చిత్తూరులో మిస్టరీగా మారిన కార్మికుడి మృతి.. యజమానే చంపేశారా..?
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరులో దారుణం జరిగింది. గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికుడు సుధాకర్ అనుమానాస్పద మృతి‌ చెందారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు ఎస్టే‌లో గ్రానైట్ ఫ్యాక్టరీలో పని ఉందని సుధాకర్‌ను యాజమని నాగరాజు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదే రోజు రాత్రి సుధాకర్ మృతదేహాన్ని స్నేహితుడు రఘు ఆటోలో తీసికొచ్చి ఇంటి దగ్గర వదిలివెళ్లారని చెబుతున్నారు. సుధాకర్ ఎందుకు మరణించాడని అడిగితే ఏమి సమాధానం చెప్పకుండా రఘు వెళ్ళిపోయారని తెలిపారు. ఆ తర్వాత రఘు పారిపోయాడని చెప్పారు. సుధాకర్ మృతిపై అనుమానాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


కాగా సుధాకర్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. త్వరలోనే కేసు ఛేదిస్తామని తెలిపారు.


Next Story

Most Viewed