కడప జిల్లాలో దారుణం.. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

by srinivas |   ( Updated:2024-10-19 11:35:38.0  )
కడప జిల్లాలో దారుణం.. సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా గోపవరం మండలం బద్వేలు సమీపంలో దారుణం జరిగింది. సెంచరీ ఫ్లైవుడ్ వద్ద యువకుడు విగ్నేశ్ రెచ్చిపోయారు. ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కనే ఉన్న చెట్లలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు గమనించి కడప రిమ్స్‌(Kadapa rims)కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన అనంతరం యువకుడు పారిపోయారు.

అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్థానిక అధికారులతో మాట్లాడారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలనే సూచించారు. దీంతో ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు పరిశీలించారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తు్న్నారు.

Advertisement

Next Story

Most Viewed