ఏపీలో దారుణం.. కళ్లలో కారంచల్లి TDP నేత భార్యను కిరాతకంగా హత్యచేసిన దుండగులు

by Satheesh |
ఏపీలో దారుణం.. కళ్లలో కారంచల్లి TDP నేత భార్యను కిరాతకంగా హత్యచేసిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత భాస్కర్ రెడ్డి సతీమణి శ్రీదేవి దారుణ హత్యకు గురి అయ్యారు. కళ్లలో కారంచల్లి బండ రాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. హత్యకు గురైన శ్రీదేవి మాజీ మంత్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు అత్యంత సన్నిహితురాలని సమాచారం. టీడీపీ నేత భార్య హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని పోస్ట్ నిమార్టం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీడీపీ నేత, ఎమ్మెల్యే అఖిల ప్రియ సన్నిహితురాలి హత్యతో ఒక్కసారిగా నంద్యాల ఉలిక్కిపడింది.

Advertisement

Next Story