వేరీజ్​.. ధర్మారెడ్డి.. వివేకా తరహాలో చంపేశారా?: బుద్దా వెంకన్న

by srinivas |
వేరీజ్​.. ధర్మారెడ్డి.. వివేకా తరహాలో చంపేశారా?: బుద్దా వెంకన్న
X

దిశ, డైనమిక్​బ్యూరో: తిరుమల లడ్డూ విషయంలో ఇంత దుమారం చెలరేగుతుటే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధర్మారెడ్డి ఏమయ్యాడని, మాట్లాడడా అని నిలదీశారు. వివేకా తరహాలో ఆయన్ను కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి.. అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు సుమోటాగా తీసుకుని పొన్నవోలుపై కేసుపెట్టాలని వెంకన్న కోరారు.

Next Story

Most Viewed