ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 16 |
ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే..!
X

దిశ, ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యాటన ఖరారు అయింది. మే 3వ తేదీన పీలేరు, విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 3న మధ్యాహ్నం 2:45కి పీలేరు, సాయంత్రం 6:30 కు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. 4న మధ్యాహ్నం 3:45కి రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.



Next Story

Most Viewed