- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బహుజనులకు పెద్దపీట వేసిన భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు : గొంగళ్ల రంజిత్ కుమార్
దిశ, గద్వాల ప్రతినిధి : బహుజనులకు పెద్దపీట వేసిన భారతీయ జనతా పార్టీ కి పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భారత్ ప్రసాద్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు. ఆదివారం సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ కుమార్ తో పాటు ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అక్కల రమాదేవి, బుచ్చిబాబు తదితరులు సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రజల,రైతుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తు నడిగడ్డ అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు.
బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన బిజెపి పార్టీ కి తాము కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని అందుకోసమే బీజేపీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ కు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు ముందుకు రావడం జరిగిందని ఆయన అన్నారు. తమ చేసే ఉద్యమాలకు బీజేపీ పార్టీ కూడా కలిసి పని చేయడానికి ముందుకు రావడం తో కలిసి పనిచేయడానికి ఇరువురం అంగీకారం తెలపడం జరిగిందని తెలిపారు. బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు బీసీలకు అవకాశం ఇచ్చిందని బహుజన వాదాన్ని కోరుకునే నడిగడ్డ హక్కుల పోరాట సమితి బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో యువతకు పెద్దపీట వేశారని తనకు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీలో నిలిపారని అని తెలిపారు. ప్రపంచంలో భారత దేశ శక్తిని నరేంద్ర మోడీ గుర్తింపు తెచ్చారని, జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే ప్రపంచ దేశం లో భారత్ నెంబర్ వన్ స్థానం దక్కించుకొంటుందని ఆయన తెలిపారు. నడిగడ్డ అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలుపుతోనే సాధ్యమని ఆయన అన్నారు.