కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి

by Disha Web Desk 15 |
కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి
X

దిశ, కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులు బోనాలు, ముఖమండప పట్నం, గంగరేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, కేశకండన, అభిషేకం, అర్చనలు, రాతిగిరాల ప్రదక్షణ, నిత్యాకల్యాణం తదితర మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈఓ బాలాజీ, ఏఈఓ లు గంగ శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.

Next Story

Most Viewed