ప్రకాశం బ్యారేజి ధ్వంసం ఘటన.. నిందితులకు 14 రోజుల రిమాండ్

by M.Rajitha |
ప్రకాశం బ్యారేజి ధ్వంసం ఘటన.. నిందితులకు 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం బ్యారేజిని పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. పడవల యజమానితో పాటు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఈ నెల 1న ప్రకాశం బ్యారేజిని మూడు బోట్లు ఢీకొట్టగా 67,68,69 గేట్ల కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. బోట్లకు సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా ఈ ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed