Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసులు

by Shiva |   ( Updated:2024-10-21 12:48:48.0  )
Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడారంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు విచారణ చేపట్టింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే, నవంబర్‌ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. పవన్‌ కల్యాణ్‌తో పాటు తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారికి కూడా హైదరాబాద్ సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed