అధికారులు అప్రమత్తంగా ఉండండి: తుపానుపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్

by Seetharam |
Ys Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుపాను నేపథ్యంలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్‌ మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని...శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని...తుపాను వల్ల విద్యుత్‌, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆయా విభాగాలను ఆదేశించారు. తుపాను పరిస్థితులు చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మరోమారు సమీక్ష నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. పొలాల్లో, కలాల్లో ఉన్న ధాన్యం తడిపోకుండా పౌరసరఫరాలశాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ధాన్యం తడిసిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్‌ చేసి, ఆ ధాన్యాన్ని భద్రమైన ప్రాంతాలకు తరలించాలని స్పష్టగమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పురోగతిని వెంటనే తనకు తెలియజేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో భారీవర్షాలు కారణంగా వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని, తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సంబంధిత అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

Advertisement

Next Story