అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ..?

by Mahesh |   ( Updated:2024-09-11 14:48:29.0  )
అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్‌ 1 నుంచి కొత్త రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. అలాగే గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని, సొంత ఆదాయం కోసం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మంత్రి ఆరోపించారు. అలాగే నాటి మద్యం పాలసీతో ప్రజల ఆర్థిక పరిస్థితులతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతిందని అన్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందకు ఇటీవల కేబినెట్‌ సబ్‌ కమిటీ తొలి సమావేశం జరిగిందని. అక్టోబర్‌ 1 నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. ఈ కొత్త పాలసీపై ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed