‘అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉంది’..మంత్రి లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |
‘అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉంది’..మంత్రి లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జరుగుతున్న ఘటనలపై తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, ప్రభుత్వం ఏం చేస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అవినీతి, హింస గురించి వైసీపీ అధినేత జగన్ మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. గత ప్రభుత్వంలో హత్య రాజకీయాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల రోజులు దాటింది అని అన్నారు. కూటమి ప్రభుత్వం మిగిలిన అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోంది అని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన వైఎస్ జగన్..అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరిగినా హత్యారాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.



Next Story