జనసేన కోసం చిరంజీవి ప్రచారం..ముహూర్తం ఫిక్స్?

by Disha Web Desk 18 |
జనసేన కోసం చిరంజీవి ప్రచారం..ముహూర్తం ఫిక్స్?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. నామినేషన్ల గడువు కూడా ముగియడంతో ఇక ప్రచారంలో దూసుకుపోతున్నారు పార్టీల నేతలు. అయితే అందరి చూపు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపే ఉంది. ఈ ఎన్నికల్లో సినీ నటులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నరనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గం నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే.. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ న్యూస్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. 2009లో చిరంజీవి తన ప్రజారాజ్యం అభ్యర్దిగా గెలిపించుకున్న వంగా గీతను నేడు ఓడించి తన తమ్ముడిని గెలిపించాలని కోరేందుకు సిద్దమయ్యారు.

మే 5న పిఠాపురంలో చిరంజీవి, నాగబాబు, రాం చరణ్ కలిసి రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. చిరంజీవి తన ప్రచారంలో జగన్‌ను టార్గెట్ చేస్తారా? లేక కేవలం పవన్‌ను గెలిపించమని కోరటం వరకే పరిమితం అవుతారా? అనేది ఉత్కంఠను పెంచుతోంది. ఈ క్రమంలోనే చిరంజీవిని అనకాపల్లిలోనూ ప్రచారం చేయాలని సీఎం రమేష్ కోరుతున్నట్లు సమాచారం. చిరంజీవి ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు పాల్గొనేలా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి రాజకీయ పాత్ర పైన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read More..

BREAKING: నామినేషన్ వేసేందుకు సిద్ధమైన "విడదల రజిని" కిడ్నాప్



Next Story

Most Viewed