పొట్టి శ్రీరాములు త్యాగం చేస్తే వైసీపీ నేతలు ఆయన స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు: నాదెండ్ల మనోహర్

by Seetharam |
పొట్టి శ్రీరాములు త్యాగం చేస్తే వైసీపీ నేతలు ఆయన స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు: నాదెండ్ల మనోహర్
X

దిశ , డైనమిక్ బ్యూరో : మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే వైసీపీ నాయకులు ఆయన స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని... అన్ని వర్గాలు కష్టాలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్‌కి పాలనపై పట్టులేకపోవడంతో యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వల్లే ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం తెనాలి నియోజక వర్గంలోని బోస్ రోడ్డులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వైసీపీ పాలనలో దోపిడీ, దౌర్జన్యాలు

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీ పొట్టి శ్రీరాములు 56 రోజులుపాటు నిరాహార దీక్ష చేశారని చెప్పుకొచ్చారు. తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే దేశానికి స్వతంత్రం సాధించవచ్చని జాతిపిత మహాత్మా గాంధీజీ అనేవారు. అంటే ఆయన పోరాటపటిమ ఏపాటిదో మనం అర్ధం చేసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరకింతమై, అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిగా ముందుగా తీసుకెళ్లిన రోజే ఆయనకు నిజంగా నివాళి అర్పించినట్లు అని నాదెండ్ల మనోహర్ అని అభిప్రాయపడ్డారు. వైసీపీలా దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడకుండా చక్కటి పాలన అందించే పాలకుల అవసరం రాష్ట్రానికి ఉందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

చంద్రబాబు బెయిల్‌ మీద విడుదలవ్వడం సంతోషం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద విడుదల కావడం హర్షించదగ్గ పరిణామం అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయ బలం, చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వమే రాబోతుంది అని చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీ రాములు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్, జనసేన నాయకులు పసుపులేటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story