ఆ విషయంలో లావు ను ఆదర్శంగా తీసుకుంటా.. టీడీపీ అభ్యర్థి

by Indraja |
ఆ విషయంలో లావు ను ఆదర్శంగా తీసుకుంటా.. టీడీపీ అభ్యర్థి
X

దిశ ప్రతినిధి.గుంటూరు: ఈ రోజు (మంగళవారం) గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల (గల్లా) మాధవి లత నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌమ్యుడిగా ఉంటూ, వివాధరహిత ఎంపీగా ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు , నరసరావుపేట ఎంపీగా పల్నాడు ప్రాంతంను కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంతో అభివృద్ధి చేశారని మాధవి కొనియాడారు.

తాను కూడా ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు స్ఫూర్తితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం ఎం. పి శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. ఉన్నత విద్యావంతురాలు అయిన గల్లా మాధవిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed