వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత.. జగన్ సంచలన ట్వీట్

by Rajesh |
వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత.. జగన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు శనివారం తెల్లవారు జామున కూల్చివేశారు. ఇక, ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ స్పందించారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని సీరియస్ అయ్యారు.

రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇస్తున్నారన్నారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్సార్సీపీ తలొగ్గేది లేదన్నారు. వెన్నుచూపేది అంతకన్నా లేదని తేల్చిచెప్పారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని జగన్ రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story