AP News:‘దొంగ ఓట్ల కేసు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయండి’ ..డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను కోరిన ఎమ్మెల్యే

by Jakkula Mamatha |
AP News:‘దొంగ ఓట్ల కేసు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయండి’ ..డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను కోరిన ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి,తిరుపతి:దొంగ ఓట్ల కేసు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయ‌న త‌న‌యుడు ఆర‌ణి మ‌ద‌న్ లు బుధ‌వారం క‌లిశారు. తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళ‌గా ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. అయితే దొంగ ఓట్ల కేసు ద‌ర్యాప్తు సాధార‌ణ ఎన్నిక‌ల ముందు నుంచి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్ళ‌గా తాను డీజీపీ, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారితో మాట్లాడుతాన‌ని హామి ఇచ్చిన‌ట్లు ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. మ‌రోవైపు టిడిఆర్ బాండ్ల స్కాంపై విజిలెన్స్ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్ల కార‌ణంగా భూమి కోల్పోయిన ప్ర‌తి ఒక్క‌రికి ప‌రిహారం అందేలా చూడాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కోరిన‌ట్లు ఆయ‌న చెప్పారు.



Next Story