Ap Politics:సీఎం జగన్మోహన్ రెడ్డిదే అంతిమ విజయం: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

by Jakkula Mamatha |
Ap Politics:సీఎం జగన్మోహన్ రెడ్డిదే అంతిమ విజయం: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
X

దిశ,చంద్రగిరి:2024 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజా మద్దతు సంపూర్ణంగా ఉంది అని వైఎస్సార్సీపీ 175/175 స్థానాల్లో విజయకేతనం ఎగుర వేస్తుందన్న బలమైన నమ్మకం ఉందని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం సీఎం జగన్ "మేమంతా సిద్ధం" యాత్ర దామల చెరువు వద్ద చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో భారీ స్థాయిలో స్వాగతం పలికారు.ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాను అడ్డాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ రెండు స్థానాల్లో ఓటమి తప్పదన్న ఆరోపణల నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు..ముందుగా వారి విజ్ఞతకే వదిలేస్తున్న అన్నారు.

నిజంగా అంత నమ్మకం ఉంటే పెద్దాయన (చంద్రబాబు నాయుడు) ఎందుకు చంద్రగిరి నుంచి నిలబడలేదని ప్రశ్నించారు. చంద్రగిరి నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా ఉండేదని, నేడు వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగుతుందన్నారు. ఇక్కడ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల అపారమైన అభిమానం కలిగిన ప్రజలు ఉన్నారని తెలిపారు. చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి విజయం చంద్రగిరి నుంచి ప్రారంభం అవుతుందని తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో 30 సంవత్సరాల కాలం కొనసాగుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి పాలన చేపడుతున్న సీఎం జగన్ కు ప్రజలు పట్టం కడతారని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ తిరుగులేని నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసేందుకు భాగస్వామ్యం అవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

Next Story