రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం..

by Jakkula Mamatha |
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం..
X

దిశ ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో హంద్రీ నీవా జలాల విడుదల సందర్భంగా పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 10.01 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి ఎస్పీ మలిక గర్గ్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ.భారతి, రిజిస్ట్రార్ ప్రొ. రజని, తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం. గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

Read More..

కుమారుడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులేసిన షర్మిల (వీడియో)

Advertisement

Next Story

Most Viewed