కుప్పం ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. వరాల జల్లు కురిపించిన చంద్రబాబు

by Satheesh |
కుప్పం ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. వరాల జల్లు కురిపించిన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత ఇలాకా కుప్పం నియోజకవర్గానికి టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాబు ఫస్ట్ టైమ్ ఇవాళ తన సొంత ఇలాకాలో పర్యటించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. కుప్పంలో విమానాశ్రయం తీసుకొస్తామని అన్నారు. కుప్పాన్ని మోడల్ మున్సిపాలిటీగా చేస్తానని హామీ ఇచ్చారు. కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్లు వేయిస్తానని అన్నారు. నియోజకవర్గంలోని మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తామని, మైనర్ పంచాయతీలకు రూ.కోటి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.

నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీరు, డ్రైనీజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెత్తను కాంపోస్ట్ ఎరువుగా మారుస్తామని, ప్రతి ఇంటికీ మంచి నీరు అందిస్తామని మాట ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రతి ఇంటికి మినరల్ వాటర్ అందిస్తామన్నారు. హంద్రీనివా నీటితో చెరువులను నింపుతామని, లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి అయిన పొలాలకు నీళ్లు అందిస్తామని తెలిపారు. కుప్పంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని చెప్పారు.

Advertisement

Next Story