- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
CM Chandrababu: అసాధారణమైన వ్యక్తి సీతారాం ఏచూరి
దిశ, వెబ్డెస్క్: వామపక్ష నేత, సీపీఐ(ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళ్లు అర్పించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. నేరుగా సీతారాం ఏచూరి నివాసానికి వెళ్లారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అప్పల నాయుడు, కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, రవీంద్ర కుమార్తో కలిసి ఏచూరి పార్ధివదేహానికి చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సదర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. ‘ఆయన ఒక మంచి నాయకుడు. నిత్యం పేదల బాగు కోరుకునే వ్యక్తి. స్వయంగా నేను 40 ఏళ్లు ఆయన్ను చాలా దగ్గర నుంచి చూశాను. ఆయనతో కలిసి పనిచేశాను. సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. ఎక్కడో కాకినాడలో పుట్టి.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగతంగా నేను ఒక మంచి మిత్రున్ని కోల్పోయాను’ అని చంద్రబాబు వెల్లడించారు.