- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
లేఖకు లేఖ.. YS జగన్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన బుద్దా వెంకన్న
దిశ, వెబ్డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్కు జగన్ రాసిన లేఖకు టీడీపీ నేతలు స్ట్రాంగ్ ఇస్తున్నారు. తాజాగా జగన్ లేఖపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. ఈ మేరకు మాజీ సీఎం జగన్కు బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. జగన్కు ఇంకా పదవీకాంక్ష తీరలేదు అని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఎలా దక్కితుంది అనే విషయంపై ఒకసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కొని జగన్ లేఖ రాయాల్సిందని ఎద్దేవా చేశారు. మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది తాము కాదని.. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని చురకలంటించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామనుకున్నారని, కానీ ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా లేదని విమర్శించారు.