ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి

by Rajesh |
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ మేరకు బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు. ఇందుకు గోరంట్ల సైతం అంగీకరించారు. దీంతో రేపు బచ్చయ్యతో ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎల్లుండి ఎమ్మెల్యేలతో గోరంట్ల బుచ్చయ్య చౌరది ప్రమాణం చేయించనున్నారు. ఈ నెల 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఏడో సారి ఎమ్మెల్యేగా ఉన్నందున తననే కొనసాగమన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Also Read: Andhra University: విద్యావ్యవస్థ చిన్నాభిన్నం.. ఏయూలోనే అంకురార్పణ

Advertisement

Next Story