Breaking: వందల కోట్లు దోచేందుకు ఏపీ సీఎం సిద్ధం.. బీజేపీ

by Indraja |   ( Updated:2024-02-19 14:32:15.0  )
Breaking: వందల కోట్లు దోచేందుకు ఏపీ సీఎం సిద్ధం.. బీజేపీ
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలన్నీ అధికార పార్టీ పై దృష్టిని సారిస్తున్నాయి. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం, తన పార్టీ ప్రచారాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విపక్ష పార్టీలన్నీ ధ్వజమెత్తుతున్నాయి. ఇటీవల ఇదే అంశం పై హైకోర్టు సీఎం జగన్ కి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ కూడా జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రజాధనంతో దుష్ప్రచారమే వైసీపీ లక్ష్యం.. వందల కోట్లు దోచేందుకు వైఎస్ జగన్ సిద్ధం అనే క్యాప్షన్ ట్యాగ్ చేసిన ఓ వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సీఎం జగన్ రూ/ 810 కోట్ల ప్రజాధనంతో సొంత పబ్లిసిటీ చేసుకుంటున్నారని పేర్కొంది.. ప్రచారం పిచ్చితో మరో రూ/ 621 కోట్లు కావాలని ప్రతిపాదనలు వస్తున్నాయని వెల్లడించింది.

సొంత పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని తెలిపింది. ప్రకటనల జారీలో హైకోర్టు ఇచ్చిన నోటీసులను కూడా సీఎం జగన్ ఖాతరు చేయడం లేదని ఆరోపించింది. ప్రచారం పేరుతో సొంత పార్టీలకు లబ్ధి చేకూర్చుకుంటున్నారని.. సమాచార శాఖ పేరుతో ప్రజాధనాన్ని జగన్ లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తింది. ప్రచారం పై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై లేదా మిస్టర్ జగన్? అని వీడియో ద్వారా ప్రశించింది.

Read More..

ఏపీలో అధికారంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story