బిగ్ బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి

by Seetharam |
బిగ్ బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు నివాసం పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గూడూరు పట్టణ సొసైటీలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు నివశిస్తున్నారు. అయితే బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి ఆవరణలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాదు ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను చించివేశాడు. అంతేకాదు వరండాలోని టేబుల్, ఫ్యాన్‌ పగలగొడుతున్న శబ్ధం రావడంతో కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళా గట్టిగా కేకలు వేసింది. దీంతో గుర్తు తెలియని ఆగంతకులు పరారయ్యారు. అయితే ఆ మహిళ ఒక ఆగంతకుడిని చూసినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఘటనకు పార్టీలో గ్రూపు రాజకీయాలే కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా గూడూరు వైసీపీలో తీవ్ర విభేధాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు ఒక వర్గం మిగిలిన వారు వేరే వర్గంగా ఉంటూ ఒకరంటే ఒకరికి పడకుండా రాజకీయం చేస్తున్నారు. ఈ వర్గపోరు నేపథ్యంలోనే వెలగపల్లి వరప్రసాద్ రావు నివాసంపై దాడి జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కేసు పెట్టలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story