- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
డీఎన్ఏ పరీక్షకు సిద్ధమా?విజయసాయి రెడ్డికి మదన్ మోహన్ సవాల్
దిశ, అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డీఎన్ఏ టెస్ట్కు రావాల్సిందేనని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ మదన్ మోహన్ డిమాండ్ చేశారు. పీహెడ్డీ కోసం తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భందాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మదన్ మోహన్ మరోసారి ఆరోపణలు చేశారు.
పీహెచ్డీ కోసం అమెరికాకు వెళ్తే..
‘2013లో శాంతిని నేను పెళ్లి చేసుకున్నాను. 2020లో దేవాదాయ శాఖలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పీహెచ్డీ కోసం నేను అమెరికా వెళ్లాను. నేను అమెరికా వెళ్లాక.. శాంతి గర్భం దాల్చింది. ఎలా అయ్యావు అని గట్టిగా అడిగితే విజయసాయి రెడ్డి పేరు చెప్పింది. విజయసాయి రెడ్డికి పిల్లలు లేరు.. అందుకే ఆయన కోసం మగబిడ్డను కన్నానని చెప్పింది. 3 నెలల నుంచి నన్ను శాంతి టార్చర్ చేస్తోంది. 2016లో శాంతికి నేను విడాకులు ఇవ్వలేదు. 2020 వరకు శాంతితో నేను కలిసే ఉన్నాను. ప్రతినెలా పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నాను..’ అని మదన్ మోహన్ తెలిపారు.
డీఎన్ఏ టెస్ట్ చేయాలి..
‘డీఎన్ఏ టెస్ట్కు నేను సిద్ధం.. విజయసాయిరెడ్డి సిద్ధమా? నా భార్య గర్భానికి కారణం ఆయన కాదని తేలితే మీడియా సాక్షిగా క్షమాపణ చెబుతా..’ అని మదన్ మోహన్ పేర్కొన్నారు. తాను అమెరికాలో ఉండగా రెండేళ్లుగా నడిచిన కథను బయటకు తీయడానికి 7 నెలలు పట్టిందని చెప్పారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, దయచేసి సత్యాన్ని బతికించాలని మీడియాను కోరారు.