CM చంద్రబాబు అధ్యక్షతన మొదలైన AP కేబినెట్ భేటీ

by Satheesh |
CM చంద్రబాబు అధ్యక్షతన మొదలైన AP కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ మొదలైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10 గంటలకు మంత్రి మండలి సమావేశం అయ్యింది. ఈ భేటీలో ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సూపర్‌-6 పథకాల అమలుపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం డిస్కస్ చేయనున్నట్లు టాక్. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశంతో పాటు శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, పోలవరం, రాజధాని అమవరాతి నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story