నటుడు ప్రకాశ్ రాజ్ మరో సంచలన ట్వీట్.. ఈసారి కూడా పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేశారా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-26 08:01:21.0  )
నటుడు ప్రకాశ్ రాజ్ మరో సంచలన ట్వీట్.. ఈసారి కూడా పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లడ్డూ(Tirupati Laddu) వివాదం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌(Prakash Raj)ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. లడ్డూ ఇష్యూపై పవన్ కల్యాణ్ స్పందించిన వెంటనే ప్రకాశ్ రాజ్ కౌంటర్‌గా.. ‘మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది. దర్యాప్తు చేయించి నిందితులకు శిక్ష వేయండి. ఎందుకు ఈ ఇష్యూను దేశ వ్యాప్తంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు’ అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేయడంతో గొడవ స్టార్ట్ అయింది. దానికి పవన్ కల్యాణ్ కౌంటర్ ఇవ్వడం.. మళ్లీ దానికి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా.. ప్రకాశ్ రాజ్ మరో ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘గెలిచే ముందు ఒక అవతారం. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం. ఎందుకీ అయోమయం. ఏది నిజం. జస్ట్ ఆస్కింగ్’ అని సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్టు పెట్టారు. ఈ ట్వీట్‌ను గమనించిన జనసైనికులు రెచ్చిపోతున్నారు. ప్రకాశ్‌ రాజ్‌కు కౌంటర్‌గా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.




Advertisement

Next Story

Most Viewed