జగన్ పాలనలో నా సన్నిహితుడికి కీలక పదవా? ఏమ్మా భారతీరెడ్డి మీ పత్రికకు సిగ్గులేదా?: నారా లోకేశ్

by Seetharam |   ( Updated:2023-11-29 06:18:53.0  )
జగన్ పాలనలో నా సన్నిహితుడికి కీలక పదవా? ఏమ్మా భారతీరెడ్డి మీ పత్రికకు సిగ్గులేదా?: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో తన సన్నిహితుడికి కీలక పదవి అంటూ వైఎస్ భారతిరెడ్డి సొంత పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు రాతలు రాస్తున్న మీ పత్రికకు సిగ్గు అనేది లేదా? అని నారా లోకేశ్ నిలదీశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘నా సన్నిహితుడికి జగన్ పాలన లో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? ఏమ్మా భారతీ రెడ్డి తప్పుడు మీ పత్రికకు సిగ్గు అనేది లేదా? పక్క రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకువైసీపీ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు మెంబర్ చెయ్యాలని కరకట్ట కమల్ హాసన్ సిఫార్సు చేసారా?’ అని నారా లోకేశ్ నిలదీశారు.‘ఇక డ్రామాలు కట్టిపెట్టు కరకట్ట కమల్. టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్య మాట్లాడింది నూటికి నూరుశాతం నిజం. అందుకు ఆయనను నేను అభినందిస్తున్నాను’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed