ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి షాక్

by Shyam |
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చుక్కెదురు అయింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై శుక్రవారం విచారించిన ఏసీబీ కోర్టు.. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed