టీ20 వరల్డ్ కప్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Harish |
టీ20 వరల్డ్ కప్ విజేతకు భారీ ప్రైజ్‌మనీ.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌ సమరం మొదలైంది. తాజాగా ఈ పొట్టి ప్రపంచకప్‌‌కు సంబంధించిన ప్రైజ్‌మనీని ఐసీసీ సోమవారం ప్రకటించింది. టోర్నీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 11.25 మిలియన్ యూఎస్ డాలర్లు(దాదాపు రూ. 93.5 కోట్లు) కేటాయించడం విశేషం. ఈ ప్రైజ్‌మనీ 2022లో జరిగిన గత ఎడిషన్‌(దాదాపు రూ.46.5 కోట్లు)తో పోలిస్తే రెట్టింపు. టోర్నీ ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచడంతో ఈ సారి విజేతగా నిలిచే జట్టు భారీ మొత్తం అందుకోనుంది. దాదాపు రూ. 20.36 కోట్లు దక్కనున్నాయి. గత ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్‌(దాదాపు రూ. 13 కోట్లు) అందుకున్న మొత్తానికి కంటే ఈ సారి విన్నర్ ప్రైజ్‌మనీ రూ. 7 కోట్లు ఎక్కువ. రన్నరప్ జట్టుకు రూ. 10.36 కోట్లు అందజేయనున్నారు. అలాగే, సెమీస్‌లో ఓడిన జట్లు రూ. 6 కోట్ల చొప్పున, సూపర్-8 దాటని జట్లు రూ. 3 కోట్లు పొందనున్నాయి. 9 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జట్లు రూ. 2 కోట్లు, 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లు రూ.1.87 కోట్లు పొందనున్నాయి. అంతేకాకుండా, ఫైనల్స్, సెమీస్ మినహా మిగతా మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు అదనంగా రూ. 25 లక్షలు ఆర్జించనున్నాయి. ఈ సారి టోర్నీ చరిత్రలో అత్యధికంగా 20 జట్లు బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed