అప్పు తెచ్చిన ముప్పు.. వ్యక్తి అదృశ్యం

by Aamani |
అప్పు తెచ్చిన ముప్పు.. వ్యక్తి అదృశ్యం
X

దిశ, శామీర్ పేట: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు.... మూడు చింతలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు(36) తన భార్యతో కలిసి మూడు చింతపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు బతుకు దెరువు నిమిత్తం రూ.ఆరు లక్షలు అప్పు చేసి వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అప్పుల బాధతో మద్యానికి బానిసై తరుచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ విషయంలో భార్య రేణుక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఇద్దరు కలిసి రాజీ పడ్డారు. కాగా గత నెల 24వ తేదీ సుమారు 9 గంటల సమయంలో బయటకు వెళ్లిన నాగరాజు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల వద్ద చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed