పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం.. మణుగూరు ఎస్పీఎఫ్ ఎస్ఐ కూతురు మృతి

by Mahesh |
పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం.. మణుగూరు ఎస్పీఎఫ్ ఎస్ఐ కూతురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని పంజాగుట్టులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న టెంపో వాహనం బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెళ్తున్న మణుగూరు ఎస్పీఎఫ్ ఎస్ఐ కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా.. ఎస్ఐ శంకర్రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఎస్ఐ తన కూతురితో కలిసి బేగంపేట నుంచి పంజాగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన ఎస్ఐను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed