టిప్పర్ కిందపడి వ్యక్తి మృతి..

by Sumithra |
టిప్పర్ కిందపడి వ్యక్తి మృతి..
X

దిశ, నారాయణపేట క్రైం : టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తనా... మరి ఇతర ఏ కారణమో తెలియదు కానీ ఓ టిప్పర్ కిందపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం నారాయణపేట జిల్లా కేంద్రం నడిబొడ్డున మెయిన్ రోడ్ పై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మక్తల్ కు చెందిన నర్సింహారెడ్డికి భీమ్మమ్మతో వివాహం జరిగింది. భీమమ్మ నారాయణపేట మున్సిపాలిటీలో అటెండర్ గా పని చేస్తుంది. ఈ మధ్యనే వీరికి కవలలు జన్మించారు. భార్య అంధురాలు కావడంతో పిల్లల పోషణ ఇబ్బందువుతుందని భీమమ్మ తల్లితో కలిసి నరసింహారెడ్డి నారాయణపేట లోనే గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో నరసింహారెడ్డి మెయిన్ చౌక్ నుంచి పాత బస్టాండ్ వైపునకు స్కూటీ పై మరొక వ్యక్తితో కలిసి వెళ్తుండగా ఇదే మార్గంలో వెళ్తున్న కేఏ 33ఏ 4685 నంబర్ గల టిప్పర్ కిందపడి మృతి చెందాడు. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed