ఘోర రోడ్డు ప్రమాదం..ఉపాధ్యాయుడు స్పాట్ డెడ్

by Jakkula Mamatha |
ఘోర రోడ్డు ప్రమాదం..ఉపాధ్యాయుడు స్పాట్ డెడ్
X

దిశ, చేర్యాల:చేర్యాల మండలం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే..చేర్యాల పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దాసరి ప్రభాకర్(36) శనివారం రాత్రి చేర్యాల నుంచి తన స్వంత గ్రామం అయిన లెనిన్ నగర్‌కు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా మార్గమధ్యంలో గుర్జకుంట వాగు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేర్యాల మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల ఎస్సై నరేష్ తెలిపారు.

Advertisement

Next Story