దోష నివారణ పూజకు వచ్చిన యువతి.. గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన పండితుడు

by Bhoopathi Nagaiah |
దోష నివారణ పూజకు వచ్చిన యువతి.. గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన పండితుడు
X

దిశ, చార్మినార్ : దోష నివారణ పూజ చేస్తానని నమ్మించి ఓ యువతిపై అసభ్యకరగా ప్రవర్తించిన రాజస్థాన్ పండితుడిని బహదూర్ పుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బహదూర్ పుర పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన రామ్ కిషోర్ జోషి (58) పండితుడు. జాతక కుండలీలో తలెత్తుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి దోష నివారణ పూజలు చేస్తుంటాడు. రామ్ కిషోర్ జోషి గురించి తెలుసుకున్న ఓ యువతి తన తల్లితో కలిసి ఆగస్టు 18వ తేదీన సంప్రదించింది. దోష నివారణ పూజలు చేయించాలని సెప్టెంబర్ 3 వ తేదీన రావాలని జోషి సూచించాడు. దీంతో ఈ నెల 3వ తేదీన తన తల్లితో కలిసి సదరు యువతి జోషి ఇంటికి చేరుకుంది. పూజలు చేయాలని గదిలోకి తీసుకెళ్లి కాసేపటికే అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. దీంతో వెంటనే సదరు యువతి కేకలు వేసింది. వెంటనే గదిలోకి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు యువతిని రక్షించి బహదూర్ పుర పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న రామ్ కిషన్ జోషి గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed