చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

by Kalyani |
చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
X

దిశ, కీసర : మద్యం మత్తులో కారు నడిపి చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగారంలో హోలీ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి రాజేందర్ మద్యం మత్తులో కారు నడిపి అదుపు తప్పడంతో కారు పల్టీ కొట్టి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేందర్ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు రాజేందర్, విశ్వ, యశ్వంత్ లుగా పోలీసులు గుర్తించారు. రాజేందర్ స్వస్థలం ధర్మపురి, రాజేందర్ ప్రస్తుతం ఘట్కేసర్ లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. రాజేందర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed